BPT: పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలను రాయాలని రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సూచించారు. కష్టం, పట్టుదలతో చదివిన విద్యార్థులు తప్పకుండా మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, గురువులకు గర్వకారణంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులు ఏకాగ్రతతో పరీక్షలను ఎదుర్కొని తమ ప్రతిభను చాటాలని మంత్రి తెలిపారు.