SKLM: ఈనెల 16వ తేదీ నుండి జరగనున్న పదో తరగతి పరీక్షలను విద్యార్థులను సన్నద్ధం చేయాలని ఎంఈవో-1 ఉప్పాడ శాంతారావు పిలుపునిచ్చారు. శనివారం నరసన్నపేట మండలం మాకివలస జడ్పీ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. పరీక్షల సమయంలో పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహకరించాలన్నారు.