NLR: జిల్లాను స్మార్ట్ సిటీ చేసేలా అన్నీ చర్యలు చేపడుతున్నామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆయన క్యాంపు కార్యాలయంలో మెప్మా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో మెప్మా ఎండీ తేజ్ భరత్, మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.