KKD: అన్నవరంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం భారీ అప్పులను వారసత్వంగా ఇచ్చిందని విమర్శించారు. ఆ అప్పులకు వడ్డీలు చెల్లిస్తూనే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయంలో 94 శాతం ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోతున్నా, ఆర్థిక సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని వెల్లడించారు.