E.G: రాజమండ్రిలో శనివారం జనసేనలోకి భారీగా చేరికలు జరిగాయి. 41వ వార్డుకు చెందిన మండవిల్లి నాగ వెంకట సత్యమురళీకృష్ణ (నానాజీ) తన అనుచరులు 50 మందితో కలిసి పార్టీలో చేరారు. సిటీ జనసేన ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో వీరికి గంట స్వరూప దేవి, తదితరులు కండువాలు కప్పి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు వారు వెల్లడించారు.