BPT: రేపల్లె మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు కౌన్సిల్ హాల్లో జరగనుంది. ఛైర్మన్ కట్ట మంగ అధ్యక్షతన నిర్వహించనున్న ఈ భేటీలో తాగునీరు, శానిటేషన్, అభివృద్ధి పనులతో సహా మొత్తం 14 అంశాలపై చర్చించనున్నట్లు కమిషనర్ సాంబశివరావు తెలిపారు. ఈ సమావేశానికి కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొనాలని తెలిపారు.