SKLM: వచ్చే నెల 11న కృష్ణా జిల్లా నూజివీడులో జరగబోయే రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు మార్చి 1న జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి ఎల్. చిట్టిబాబు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అరసవల్లిలో గల ఆర్చరీ అకాడమీలో ఆర్చరీ పోటీలకు ఎంపికలు నిర్వహిస్తామని తెలిపారు.