KDP: జెడ్పీహెచ్ఎస్ఎస్ మైదుకూరులో BFSI వృత్తి విద్యలో భాగంగా విద్యార్థులకు ప్రాయోగిక అవగాహన కల్పించేందుకు మంగళవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వైఎస్ఆర్నగర్ శాఖలో పారిశ్రామిక సందర్శన నిర్వహించారు. శాఖ మేనేజర్ పీ. శర్మిల విద్యార్థులకు బ్యాంక్ పనితీరు, ఖాతా ప్రారంభం, రుణాల ప్రక్రియ, డిజిటల్ బ్యాంకింగ్ సేవలపై వివరించారు.