అనంతపురంలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ కేసులో విచారణ వేగం పుంజుకుంది. ఎస్పీ జగదీశ్ పర్యవేక్షణలో తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్, ట్రైనీ ఐపీఎస్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు సీఐలు, ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లను వీఆర్కు పంపారు. ఈ కేసులో మరో సీఐ, కొంతమంది కానిస్టేబుళ్ల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది.