NDL: నందికొట్కూరు పట్టణంలోని మారుతి నగర్ కాలనీలో మౌలిక వసతులు కల్పించకపోతే ఆందోళన చేపడతామని సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరావు హెచ్చరించారు. సోమవారం మారుతి నగర్ కాలనీ ప్రజలతో పెయింటర్ హుస్సేన్సా అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. నాగేశ్వరావు మాట్లాడుతూ.. మారుతి నగర్ కాలనీ ఏర్పడి 30సంవత్సరాలు అవుతున్న, కాలనీలో రోడ్లు ,మంచినీటి సమస్యలు ఎదురుకుంటున్నారు.