ATP: కొండూపల్లిలో గతంలో కురిసిన వడగళ్ల వానకు గొర్రెలు కోల్పోయిన 15 మంది రైతులకు ప్రభుత్వం రూ. 7,14,000 నష్టపరిహారం మంజూరు చేసింది. అనంతపురం జిల్లాకు చెందిన కాపరుల కష్టాలను ఎమ్మెల్యే బండారు శ్రావణి సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో ఈ నిధులు విడుదలయ్యాయి. 238 గొర్రెలు మరణించగా బాధిత కుటుంబాలకు ఈ సాయం అందింది.