TPT: తిరుపతి కొర్లగుంటకు చెందిన రాజేంద్ర తిరుమల కళ్యాణ కట్టలో విధులు నిర్వహిస్తున్నాడు. మంగళం ఏరియాకు చెందిన ఓ మహిళ వద్ద రూ. 15 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. 2022లో అతను ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం తిరుపతి 4వ అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి రాజేంద్రకు 6నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.