ప్రకాశం: చంద్రశేఖరపురం(M)లోని మిట్టపాలెం నారాయణ స్వామి ఆలయాన్ని సోమవారం తెల్లవారుజామున తెరిచి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం ఆలయాన్ని మూసేసిన అధికారులు సోమవారం ఆలయ ఈవో గిరిరాజు నరసింహ బాబు, అర్చకులు మహంకాళి నరసింహారావు ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.