ATP: జిల్లాలోని పర్యాటక ప్రాపర్టీల నిర్వహణకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జిల్లా పర్యాటక అధికారి తెలిపారు. మారూరు టోల్ గేట్ రెస్టారెంట్, తాడిపత్రి హోటల్, ఎంపీఆర్ డ్యామ్ రెస్ట్ హౌస్ భవనాలను వార్షిక లీజు పద్ధతిలో కేటాయించనున్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 16వ తేదీలోపు పర్యాటక కార్యాలయంలో వివరాలు పొందవచ్చన్నారు. కాగా, ఏప్రిల్ 17న వేలం ఉంటుందని వెల్లడించారు.