KRNL: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదివారం విమర్శించారు. ఇంధనం లేక రవాణా వ్యవస్థ దెబ్బతిని నిత్యావసర సరుకుల రవాణాకు ఆటంకం కలుగుతోందన్ని పేర్కొన్నారు. నిల్వలు ఉన్నాయని చెబుతున్నా బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని ఎమ్మెల్యే ఆరోపించారు.