TPT: శ్రీచెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానంలో నిత్య అన్నదాన కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. వెంకటగిరికి చెందిన జొన్నదుల ధార్విక్ శివాన్హ్ కుటుంబసభ్యులు రూ.60,000 నగదు విరాళంగా అందజేశారు. అలాగే త్రివేదుల విష్ణు కుటుంబసభ్యులు రూ.50,000 నగదును సమర్పించారు. ఈ విరాళాలను సహాయ కమిషనర్, ఈవో బి.ప్రసన్నలక్ష్మీ స్వీకరించి దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.