కృష్ణా: మచిలీపట్నం మండలం తాళ్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో శనివారం బాలికలకు వ్యాక్సినేషన్ డ్రైవ్ జరిగింది. ఈ సందర్భంగా వైద్యులు హిమబిందు, పద్మజ బాలికలకు హెచ్ పీవీ వ్యాక్సిన్లను వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బాలికల ఆరోగ్య రక్షణకు ఈ టీకా ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. బాలికలు ఈ టీకాను తప్పనిసరిగా వేయించుకోవాలని సూచించారు.