NDL: ఆత్మకూరు స్వరాజ్నగర్కు చెందిన ఆదిలక్ష్మి అనే మహిళ ఈనెల 7న బెంగళూరు వెళ్ళారు. 9న ఆమె తిరిగి రాగా ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన ఎస్సై హుస్సేన్ బాషా దర్యాప్తు చేపట్టి శనివారం చోరీకి పాల్పడిన షేక్ ఖాదర్ బాషా(గుండు)ను శనివారం అరెస్ట్ చేసి రూ.1,45,000 విలువగల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.