NTR: ప్రయాణికుల రద్దీ మేరకు శ్రీకాకుళం రోడ్(CHE), చర్లపల్లి(CHZ) మధ్య విజయవాడ మీదుగా స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు మే 13 నుంచి జూన్ 24 వరకు ప్రతి మంగళవారం CHZ- CHE(నం.07421), మే 14 నుంచి జూన్ 25 వరకు ప్రతి బుధవారం CHE- CHZ(నం.07422) మధ్య ఈ రైళ్లు నడుస్తాయన్నారు. ఈ రైళ్లు ఏపీలోని పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.