ప్రకాశం: తర్లుపాడు మండలం తుమ్మలచెరువు గ్రామంలో ఎన్నో రోజులుగా కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని, మట్టిని గురువారం పారిశుద్ధ్య కార్మికులు తొలగించారు. దోమల వ్యాప్తి పెరిగి, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని గుర్తించిన స్థానికులు అధికారులకు తెలియజేయడంతో నేడు కాలువలను శుభ్రం చేశారు. చెప్పగానే స్పందించిన అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.