సత్యసాయి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూనే కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదని మండిపడ్డారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500, 50 ఏళ్లకే పింఛన్ వంటి పథకాల్లో మహిళలకు వేల కోట్ల రూపాయలు బాకీ పడ్డారని ఆరోపించారు.