NDL: అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు మరువలేనివని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఫరూక్ అన్నారు. పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆదివారం పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అతిధులు పొట్టి శ్రీరాములు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు.