VSP: విశాఖ రైల్వే స్టేషన్ సమీపంలోని 150 ఏళ్ల నాటి మర్రి చెట్టు వద్ద గ్రీన్ క్లైమేట్ టీం ఆధ్వర్యంలో పిచ్చుకల పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏసీపీ రాఘవేంద్రరావు కార్యక్రమాన్ని ప్రారంభించి పిచ్చుకలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. రసాయన క్రిమిసంహారకాల వినియోగం, కాంక్రీట్ భవనాల పెరుగుదలతో పిచ్చుకలు అంతరించిపోతున్నాయన్నారు.