TPT: శ్రీకాళహస్తి మండలం కలవగుంట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తాటికల్లు గీస్తున్న సమయంలో తాటి చెట్టుపై పిడుగు పడటంతో గీత కార్మికుడు వీ. కామరాజ్ (35) కిందపడిపోయాడు. స్థానికులు వెంటనే ఆయనను వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు ఏర్పేడు మండలం పరమాలపల్లి గ్రామానికి చెందినవాడు.