GNTR: పెదనందిపాడు మండలం నాగులపాడుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వీరభద్రయ్య (80) బ్రెయిన్ స్ట్రోక్తో శనివారం కన్నుమూశారు. పురుగు మందుల వ్యాపారంతో మొదలుపెట్టి, కాటన్ జిన్నింగ్ మిల్లు స్థాపించి ఆయన మంచి గుర్తింపు పొందారు. గతంలో మిల్లు ప్రమాదంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ఎంతో మందికి ఉపాధి కల్పించి నిబద్ధత గల వ్యాపారవేత్తగా నిలిచారు.