కృష్ణా: స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏపీ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి మచిలీపట్నంలోని బస్టాండ్ను మంత్రి కొల్లు రవీంద్ర శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో మంత్రి కాసేపు ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాలాజీ, డీఎం పెద్దిరాజులు పాల్గొన్నారు.