NDL: కుల రహిత సమాజం కోసం కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని ఎమ్మెల్యే గిత్త జయసూర్య పేర్కొన్నారు. ఆదివారం నందికొట్కూరులోని ఎంపీడీవో కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే గిత్త జయసూర్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు.