కృష్ణా: నూజివీడులో మాజీ మంత్రి జోగి రమేశ్ పాల్గొన్న ఘటన టీడీపీ నేతలు అందరికీ బాధ కలిగించిందని టీడీపీ నేత బుద్ధ వెంకన్న అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు ఇంటిపైకి జోగి రమేశ్ దాడికి వెళ్ళిన ఫొటోలను ఆయన ప్రదర్శించారు. నీచంగా దూషణలు చేసి.. చంద్రబాబుకు బాధ కలిగించిన వ్యక్తి జోగి రమేశ్ అన్నారు. అటువంటి నాయకుడితో తిరగడం మంచి పద్ధతి కాదన్నారు.