E.G: జిల్లాలో కౌలు రైతులు కూడా భూమి యజమానులతో సమానంగా పంట రుణాలు పొందే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం 7వ జిల్లా కోఆపరేటివ్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. రైతులకు రుణాల మంజూరులో ఎదురవుతున్న అడ్డంకులు, భూముల మార్టిగేజ్ ప్రక్రియ, కౌలు రైతుల గుర్తింపు వంటి అంశాలను సమీక్షించారు.