ఏలూరు: జిల్లాను నేరరహితంగా తీర్చిదిద్దేందుకు పోలీసు అధికారులంతా సమిష్టిగా కృషి చేయాలని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశించారు. మంగళవారం సబ్ డివిజనల్ పోలీసు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. నమోదైన కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలని, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.