ATP: తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో కార్తీకమాసం ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. కార్తీక మాసం తొలి శుక్రవారం సందర్భంగా భస్మాలంకరణలో బుగ్గ రామలింగేశ్వరస్వామి దర్శనం ఇచ్చారు. వందలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు భక్తులను ఆశీర్వించి తీర్థప్రసాదాలు అందజేశారు.