NLR: జిల్లాలో ఏర్పాటవుతున్న పరిశ్రమలకు మౌలిక వసతులను త్వరితగతిన కల్పించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన జిల్లాస్థాయి పరిశ్రమలు, ఎగుమతులు ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. భూ సేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి, నీరు, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని సూచించారు.