AKP: జిల్లాలో 31 కేంద్రాల్లో శనివారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు 196 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు డీఐఈవో వినోద్ బాబు తెలిపారు. మొత్తం 2,031 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 1,835 మంది హాజరైనట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా పకడ్బందీగా ఎటువంటి మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.