ప్రకాశం: యర్రగొండపాలెంలో ఓ టీవీ రిపోర్టర్గా విధులు నిర్వహిస్తున్న షేక్ అబ్దుల్ ఖలీల్ శుక్రవారం గుండెపోటుకు గురయ్యారు. ఈ మేరకు గుంటూరులోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఆయన మృతి చెందారు. అబ్దుల్ ఖలీల్ మండలంలో రిపోర్టర్గా ఎంతో చురుకుగా పనిచేశారు. కాగా, ఆయన మృతికి పలువురు సంతాపం తెలియజేశారు.