BPT: ఈ నెల 16, 17, 18వ తేదీల్లో రాజమండ్రిలో జరిగే ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ 6వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ పిలుపునిచ్చారు. శనివారం ఏఐటీయూసీ కార్యాలయంలో మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. సుప్రీంకోర్టు జీవో ప్రకారం మున్సిపల్ కార్మికులకు రూ. 26 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.