కడప నగరంలోని నగరపాలక ప్రధాన ఉన్నత పాఠశాలలో ఇవాళ నుంచి పదో తరగతి మూల్యాంకనం ప్రారంభం కానుంది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యా శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి జవాబుపత్రాలు జిల్లాకు వచ్చాయి. మొత్తంగా 1,95,674 జవాబు పత్రాలు ఉన్నాయి. ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకూ మూల్యాంకనం నిర్వహిస్తున్నట్లు DEO షంషుద్దీన్ తెలిపారు.