అనంతపురం: జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు పోలీసు స్టేషన్ల పరిధిల్లో పోలీసులు బుధవారం డ్రోన్లను ఎగురవేశారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి లక్ష్యంగా అనంతపురం టూటౌన్, ఫోర్త్ టౌన్, గుత్తి, కళ్యాణదుర్గం వంటి పోలీసు స్టేషన్ల పరిధిల్లో డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు.