KRNL: ఆదోని సాయినగర్ కాలనీకి చెందిన వీరేష్ మున్సిపల్ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పన్నులు పెంచుతున్నా కాలనీలో విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు అధ్వాన్నంగా ఉన్నాయని ఇవాళ విమర్శించారు. సమస్యలపై పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరారు.