PPM: జిల్లాలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి వద్దనే పింఛన్లు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో ఇవాళ ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలువురు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు వారి నివాసాల వద్దకే కలెక్టర్ వెళ్లి నేరుగా పింఛన్లను పంపిణీ చేశారు.