E.G: రాజమండ్రిలోని బీజేపీ కార్యాలయం వద్ద శుక్రవారం ‘జనతా వారధి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోడూరు లక్ష్మీనారాయణ, యానాపు ఏసు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ, చెరువుల ఆక్రమణ, పింఛన్ల తదితర సమస్యలపై పలు వినతులు వచ్చాయి. వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.