KRNL: కౌతాళం మండలంలోని బదినేహాల్ గ్రామ సర్పంచ్ మాల నరసప్ప ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తనయుడు వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రదీప్ రెడ్డి మాల నరసప్ప కుటుంబాన్ని పరామర్శించారు. అధైర్య పడొద్దని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే తరఫున రూ. 25 వేలు నగదును ఆర్థిక సహాయంగా అందజేశారు.