సత్యసాయి: తుళ్లూరులో ఈనెల 16న నిర్వహించనున్న అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాల ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి సవిత శనివారం స్మృతి వనంలో జరుగుతున్న పనులు, ముఖ్యమంత్రి సభా ప్రాంగణ ఏర్పాట్లను పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఎక్కడా లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు.