విశాఖపట్నంలోని మరకవలస ప్రాంతంలోని హిమాద్రి ఐస్ ప్లాంట్లో ఇవాళ ప్రమాదం జరిగింది. విధుల్లో ఉన్న సమయంలో స్లాబ్ కూలిపోవడంతో పీతల గోవింద్ (52) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు.