GNTR: యూరియా సరఫరాలో అవకతవకలు, దళారుల ఆధిపత్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం పెదకాకాని తహసీల్దార్ కార్యాలయం వద్ద సీపీఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఐదు నుంచి పది ఎకరాలున్న రైతులకు ఒక్క బస్తా యూరియా కూడా ఇవ్వడం లేదని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కొల్లి రంగారెడ్డి విమర్శించారు. తక్షణమే తగినంత యూరియాను సరఫరా చేయాలని కోరారు.