కర్నూలు: గడపగడపకు సీపీఐ విరాళాల సేకరణ కార్యక్రమం రెండో రోజు కొనసాగింది. మూడు బృందాలుగా విడిపోయిన నాయకులు, కార్యకర్తలు ప్రజలను కలుసుకుని విరాళాలు సేకరించారు. నగర కార్యదర్శి పి. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నగరాల్లో ఇంటి స్థలం లేని ప్రతి పేద కుటుంబానికి 2 సెంట్ల స్థలం ఇచ్చి, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.