KDP: యువత క్రీడల్లో రాణించాలని TDP జిల్లా అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి పిలుపునిచ్చారు. కొన్ని రోజులుగా ఎర్రగుంట్ల (M) వై. కోడూరులో క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. ఇందులో విజేతగా నిలిచిన Kcc11 టీంకు రూ.1.50 లక్షలు,రన్నరుగా నిలిచిన ఫ్రెండ్స్ 11 టీంకు రూ. 75 వేల నగదును భూపేశ్ బహుమతిగా అందించారు. నేటి ఓటమి రేపటికి గెలుపునకు నాంది అని క్రీడాకారులకు ఆయన సూచించారు.