ప్రకాశం: వెలిగండ్ల మండలం మరపగుంట్ల సచివాలయంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 75% సబ్సిడీపై గడ్డి జొన్నలను రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్ శ్యామల కాశిరెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సూచనల మేరకు మండలంలోని ప్రతి సచివాలయానికి ఒక టన్ను గడ్డి జొన్నలు మంజూరు చేసినట్లు తెలిపారు.