E.G: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సూచించారు. చాగల్లులోని నెలటూరు సీతారామ కళ్యాణ మండపంలో మంగళవారం టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం టీడీపీ చాగల్లు మండల, గ్రామ కమిటీ, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జ్లతో ప్రమాణ స్వీకారం చేయించారు.