CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి ఇవాళ సాయంత్రం మహానంది ఆలయ పట్టు వస్త్రాలు సమర్పించారు. మహానంది దేవస్థానం ఈవో శ్రీనివాసరెడ్డి, దేవస్థానం అతిథి గృహం నుంచి మేళ తాళాలతో పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చారు. ఆలయ ఈవో పెంచల కిషోర్ వారికి ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం పూజారులు తీర్థప్రసాదాలు అందజేశారు.