ASR: సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అరకు వ్యాలీలో ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ సియ్యారి దొన్నుదొర ‘ప్రజా వేదిక’ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.